సామజవరగమనా, నేనిల్లు దాటగలనా!

న్యూఢిల్లీ : హాస్యం ఎంతటి విషాదాన్నైనా మరపిస్తుందనడంలో సందేహం లేదు. కోవిడ్‌ మహమ్మారి ప్రపంచ దేశాలతోపాటు భారత్‌ను వణికిస్తోన్న ప్రస్తుత తరుణంలో ఇంటికే పరిమితమవుతున్న లక్షలాది మంది ప్రజలకు కాలక్షేపం కల్పించేందుకు, హాస్యంతో వారి భయాందోళనలకు కాసేపైనా దూరం చేసేందుకు సోషల్‌ మీడియా కళాకారులు తమదైన శైలిలో కృషి చేస్తున్నారు. ఈ మధ్య వచ్చిన తెలుగు సినిమా ‘అల వైకుంఠాపురం’లోని సామజవరగమన అనే పాటకు ఇది వరకే చాలా మంది తమదైన రీతిలో పారడీలు కట్టగా తాజాగా కరోనాపై కట్టిన పారడీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. (కరోనా పరీక్షల్లో వెనకపడ్డ భారత్‌)



 


Popular posts